ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు
ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు
నందిగామ జూన్ 12 (వెలుగునాడు ప్రతినిధి) : నందిగామ పట్టణం కాకాని నగర్లోని తన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యే ఎదుట నేరుగా వినిపించారు. తంగిరాల సౌమ్య ప్రజలను సానుకూలంగా ఆహ్వానించి, వారి సమస్యలను ఓపికగా విన్నారు. ప్రతి సమస్యను వివరంగా అర్థం చేసుకుని, సంబంధిత అధికారులకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.ఎమ్మెల్యే సౌమ్య ప్రతి సమస్యపై స్పందించి, "ప్రజల సమస్యలు నా సమస్యలు" అని పేర్కొన్నారు. "ప్రభుత్వం ప్రజల కోసమే. వారి బాధలు తీర్చడం మా ప్రధాన బాధ్యత" అని ఆమె అన్నారు. ఈ ప్రజా దర్బార్లో స్థానిక అధికారులు హాజరయ్యారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
1