గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

May 15, 2026 - 23:15
 0  30
గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

జగ్గయ్యపేట,మే15, (వెలుగు నాడు ప్రతినిధి )  : నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఏసీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి వి వి సత్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం తనిఖీ నిర్వహించారు.గ్రామపంచాయతీలో ఒక కోటి 21లక్షల 66 వేల 859 రూపాయల నిధులు దుర్వినియోగం అయినట్లు డీ ఎల్ పీ ఓ రాఘవన్ జిల్లా పంచాయతీ అధికారికి, జిల్లా కలెక్టర్ కు గతంలో నివేదిక సమర్పించారు.ఈ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు గురువారం పెరుగంచిప్రోలు గ్రామపంచాయతీ కార్యాలయం సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ రాఘవన్ , పంచాయతీ కార్యదర్శి శ్యామ్ కుమార్ ,గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్