పెనుగంచిప్రోలు ఆలయం ఆర్చ్ వద్ద ప్రమాదం
పెనుగంచిప్రోలు ఆలయం ఆర్చ్ వద్ద ప్రమాదం
వ్యక్తి మృతి
జగ్గయ్యపేట,జూన్ 28, ( వెలుగు నాడు ప్రతినిధి ) : పెనుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం ఆవరణ ఆర్చ్ వద్ద ఆదివారం విషాదం చోటుచేసుకుంది.ఆర్టీసీ బస్సు, దేవస్థానం ఆర్చి మధ్యలో చిక్కుకుని వాహనాల పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న ఎన్ సతీష్ కుమార్ (40) మృతి చెందాడు. సతీష్ కుమార్ వత్సవాయి మండలం రేగులగడ్డ గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు తెలిపారు.పెనుగంచిప్రోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0