కర్నూలు జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ .
ఏపీ స్టేట్ బ్యూరో జనవరి 13 (వెలుగు నాడు న్యూస్ ) : ఇంటిల్లిపాది సంతోషంగా పండుగ జరుపుకోవాలి. డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ.సంక్రాంతి పండుగ పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి, మీడియా సోదరులకు డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను మంగళవారం తెలియజేశారు.సంక్రాంతి పండుగ అందరి జీవితాలలో నూతన కాంతులు, సంతోషాలు నింపాలని కోరారు.తెలుగు సంస్కృతి సంప్రదాయాల మేలవింపుతో కుటుంబసభ్యులు, ఇంటిల్లిపాది సంతోషంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికెళ్లకుండా భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపుకోవాలని ఈ సంధర్బంగా డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ జిల్లా ప్రజలకు తెలియజేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0