టైరు పగలడంతో టాటా ఏస్ వాన్ బోల్తాతప్పిన ప్రమాదం
టైరు పగలడంతో టాటా ఏస్ వాన్ బోల్తాతప్పిన ప్రమాదం
శ్రీకాళహస్తి మార్చి 10 (వెలుగు నాడు ప్రతినిధి) : నాయుడుపేట ,పూతలపట్టు జాతీయ రహదారి పై శ్రీకాళహస్తి సమీపంలో గల మల్లిగుంట క్రాస్ వద్ద టమోటా లోడ్తో అతివేగంగా వెళుతున్న టాటా ఏస్ వ్యాన్ టైరు పగలడంతో అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. వాహనంలో డ్రైవర్తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఘటనతో కొంతసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికులు వెంటనే స్పందించి వాహనాన్ని పక్కకు జరిపి ట్రాఫిక్ను సవ్యంగా సాగేటట్లు చేశారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
1
Wow
1