ఎర్రవరం నారసింహుని సేవలో ఎమ్మెల్యే తాతయ్య
ఎర్రవరం నారసింహుని సేవలో ఎమ్మెల్యే తాతయ్య
జగ్గయ్యపేట జనవరి30 (వెలుగు నాడు ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం, యర్రవరం గ్రామంలో వెలసిన ప్రసిద్ధ బాల ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని శుక్రవారం జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) దర్శించుకున్నారు.ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు,అభిషేక కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0