దేశ ఆవిష్కరణ రంగంలో తెలంగాణ ముందంజ మంత్రి ఉత్తమ్
దేశ ఆవిష్కరణ రంగంలో తెలంగాణ ముందంజ మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, మార్చి 1, (వెలుగు నాడు ప్రతినిధి ): జాతీయ సైన్స్ డే సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, విజ్ఞానం ప్రయోగశాలల గోడలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలుగా మారాలని అన్నారు. పరిశోధనల ఫలితాలు ప్రజల జీవితాలను మెరుగుపరచే ప్రాయోజిక పరిష్కారాలుగా రూపాంతరం చెందాలని ఆయన సూచించారు. శనివారం రీసెర్చ్ హైట్స్ ఫౌండేషన్ నిర్వహించిన సస్టైనబుల్ భారత్ 2047 కోసం పరిశోధన, డీప్ టెక్నాలజీలు జాతీయ సదస్సులో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ఆవిష్కరణ రంగంలో తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు.హైదరాబాద్ రక్షణ పరిశోధన, బయోటెక్నాలజీ, ఔషధ తయారీ, ఏరోస్పేస్ రంగాల్లో కీలక కేంద్రంగా ఎదిగిందన్నారు. పరిశోధనలకు ప్రభుత్వ మద్దతు, పరిశ్రమల భాగస్వామ్యం అవసరమని చెప్పారు.యువ శాస్త్రవేత్తలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ల్యాబ్లో పుట్టిన ఆలోచనలు మార్కెట్కు చేరినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇలాంటి సదస్సులు దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతంగా తీర్చిదిద్దడంలో దోహదపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0