ప్రాధాన్యత సంతరించుకుంటున్న ఆయుర్వేద వైద్యం 

Mar 5, 2026 - 23:51
 0  85
ప్రాధాన్యత సంతరించుకుంటున్న ఆయుర్వేద వైద్యం 

ప్రాధాన్యత సంతరించుకుంటున్న ఆయుర్వేద వైద్యం 

డాక్టర్ రత్న ప్రియదర్శిని

ఎన్టీఆర్ బ్యూరో మార్చి05 (వెలుగునాడు ప్రతినిధి) : వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆయుర్వేద వైద్యం మళ్లీ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంటుందని ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని అన్నారు.ఈమె ఎన్టీఆర్ జిల్లా ఇనగంచిప్రోలు మండలం అనిగిళ్ళపాడు గ్రామంలో ఆయుర్వేద వైద్యులుగా పనిచేస్తున్నారు.ఈ వైద్య విధానం ప్రాధాన్యతను ఆమె సూర్య ప్రతినిధితో పంచుకున్నారు.ఈ వైద్య విధానం శరీరం,మనసు,ఆత్మ సమన్వయాన్ని లక్ష్యంగా పెట్టుకుని సమగ్ర ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రాచీన గ్రంథాలైన చరక సంహిత,శుశ్రుత సంహిత, అష్టాంగ హృదయం లలో వివరించిన సిద్ధాంతాలు నేటికీ ప్రామాణికంగాపరిగణించబడుతున్నాయని అన్నారు.పంచమహాభూతాలు, త్రిదోష సిద్ధాంతాలపై ఆధారపడిన ఈ విధానం ప్రకారం వాత, పిత్త, కఫ దోషాల అసమతుల్యతే వ్యాధుల మూల కారణంగా భావించబడుతుంది. అందువల్ల చికిత్సలో భాగంగా దోష సమతుల్యం, జీర్ణాగ్ని బలపరచడం, జీవనశైలి సవరణలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.ఇటీవలి కాలంలో ఒత్తిడి, అసమయ భోజనం, వ్యాయామలేమి వంటి కారణాలతో జీవనశైలి సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు సహజ వైద్య విధానాల వైపు మళ్లుతున్నారని అన్నారు. సంధివాతం, మధుమేహం ప్రారంభ దశలు, జీర్ణ సమస్యలు, చర్మవ్యాధులు, నిద్రలేమి వంటి సమస్యలలో ఆయుర్వేద చికిత్సలు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అశ్వగంధ, తులసి, గుడూచి వంటి మూలికలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో, వాపు తగ్గించడంలో, మానసిక ప్రశాంతత కలిగించడంలో సహాయపడతాయని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి. త్రిఫల, దశమూల, గుగ్గులు వంటి సంయోగాలు శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో మరియు మెటాబాలిజం సరిచేయడంలో దోహదపడతాయని ఆమె తెలిపారు.పంచకర్మ అనే శుద్ధి చికిత్సా విధానం ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం పొందింది. ఈ విధానాలు శరీరానికి పునరుత్తేజాన్ని అందించడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవి అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలని అన్నారు..ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆయుర్వేదానికి సంస్థాగత మద్దతు పెరుగుతోంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆయుష్ ఆసుపత్రులు, ఆరోగ్య శిబిరాలు, అవగాహనకార్యక్రమాలునిర్వహించబడుతున్నాయి. ఆధునిక వైద్యంతో సమన్వయంగా ఆయుర్వేదాన్ని వినియోగించడం ద్వారా సమగ్ర ఆరోగ్య పరిరక్షణ సాధ్యమని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే స్వయంగా మందులు వినియోగించడం కంటే నిపుణుల సలహాతోనే చికిత్స తీసుకోవడం అవసరమని డాక్టర్ హెచ్చరిస్తున్నారు.మొత్తంగా, రోగం వచ్చిన తరువాత చికిత్సకంటే రోగం రాకుండా జీవనశైలిని మార్చడం ఆయుర్వేదం యొక్క అసలు లక్ష్యమని డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని అభిప్రాయం వ్యక్తం చేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్