ఎమ్మార్పీఎస్ తిరువూరు నియోజవర్గ కన్వీనర్ గా వెంపాటి సురేష్ మాదిగ నియామకం
ఎమ్మార్పీఎస్ తిరువూరు నియోజవర్గ కన్వీనర్ గా వెంపాటి సురేష్ మాదిగ నియామకం
తిరువూరు జూన్ 29, (వెలుగు నాడు ప్రతినిధి) : తిరువూరు,నియోజవర్గ కన్వీనర్ గా ఏ కొండూరు మండలం పాత కొండూరు గ్రామానికి చెందిన వెంపాటి సురేష్ మాదిగ ను నియమించినట్లు ఎమ్మార్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మారబత్తుల గోపాల్ మాదిగ తెలిపారు. నిన్న తిరువూరులో జరిగిన ఎమ్మార్పీఎస్ నియోజవర్గ సమావేశంలో ఈ నియామకం చేసినట్లు గోపాల్ తెలిపారు.ఈ పదవికి నన్ను నియమించినందుకు జిల్లా నాయకత్వానికి వెంపాటి సురేష్ మాదిగ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జూలై 7న ఈదుమూడి లో జరగనున్న మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమం జయప్రదం చేయడానికి నియోజక వర్గం మొత్తం పర్యటించి మాదిగలను అధిక సంఖ్యలో తరలిస్తానని సురేష్ మాదిగ తెలిపారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0