వేదాద్రి ఆలయ శిఖరంపై సూర్యబింబం
వేదాద్రి ఆలయ శిఖరంపై సూర్యబింబం
జగ్గయ్యపేట ఫిబ్రవరి 21 (వెలుగు నాడు ప్రతినిధి) : జగ్గయ్యపేట మండలం లోని వేదాద్రి గ్రామంలో వేంచేసియున్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో శనివారం సాయం సంధ్యలో ఓ అద్భుతమైన దృశ్యం భక్తులకు కనువిందు చేసింది.ఆలయ గోపురంపై సాయం సూరీడు గోపురం శిఖారాగ్రంలో బింబంలా దర్శనమిచ్చాడు.ఈ దృశ్యాన్ని భక్తులు,ప్రకృతి ప్రేమికులు తన్మయత్వంతో వీక్షించారు.ధర్మవరప్పాడు తండా ఉపాధ్యాయుడు పర్చా లక్ష్మణరావు ఈ అపురూప దృశ్యాన్ని తన ఫోన్ కెమెరాలో భద్రపరిచాడు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0