జూనియర్ టెన్త్’ తరగతుల్లో చిన్నారులపై ముందస్తు ఒత్తిడి

Jan 21, 2026 - 01:36
 0  5
జూనియర్ టెన్త్’ తరగతుల్లో చిన్నారులపై ముందస్తు ఒత్తిడి

జూనియర్ టెన్త్’ తరగతుల్లో చిన్నారులపై ముందస్తు ఒత్తిడి

జగ్గయ్యపేట,జనవరి 20, (వెలుగు నాడు ప్రతినిధి): ఇటీవల కొన్ని పాఠశాలల్లో 9వ తరగతి పూర్తికాకముందే ‘జూనియర్ టెన్త్’ పేరుతో 10వ తరగతి పాఠాలు ప్రారంభించడం విద్యార్థుల రోజువారీ చదువు అనుభవాన్ని మారుస్తోంది.ముందుగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో మొదలైన ఈ విధానం,వాస్తవానికి కొంతమంది విద్యార్థులకు భారంగా మారుతోందని తల్లిదండ్రులు గమనిస్తున్నారు.9వ తరగతి పాఠ్యాంశాలు ఆరు నెలలు మాత్రమే బోధించి ఇంకా పూర్తిగా అవగాహన కాకముందే కొత్త సిలబస్‌ను పరిచయం చేయడం వల్ల పిల్లలు అయోమయానికి లోనవుతున్నారని ఉపాధ్యాయులుచెబుతున్నారు.ముఖ్యంగా గణితం,విజ్ఞాన శాస్త్రం వంటి విషయాల్లో పునాది బలపడకముందే ముందుకెళ్లడం వల్ల ఆసక్తి తగ్గిపోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.కొంతమంది విద్యార్థులు ఎక్కువ సమయం చదువులోనే గడుపుతూ ఆటలు,విశ్రాంతికి దూరమవుతున్నారు.“ముందు చదువు బాగానే ఉంది కానీ, పిల్లల్లో అలసట కనిపిస్తోంది” అని పలువురు తల్లిదండ్రులు మృదువుగా తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, కొన్ని పాఠశాలలు ముందస్తు బోధన వల్ల పిల్లలు పరీక్షలకు మెరుగ్గా సిద్ధమవుతారని భావిస్తున్నాయి.కానీ ప్రతి విద్యార్థి ఒకే వేగంతో నేర్చుకోలేడన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.విద్య అనేది కేవలం పాఠ్యపుస్తకాల పరిమితిలో కాకుండా, పిల్లల మానసిక వికాసాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు.జూనియర్ టెన్త్’ వంటి విధానాలు అమలు చేసే ముందు, విద్యార్థుల సామర్థ్యం, ఆసక్తులు, విశ్రాంతి అవసరాలను సమతుల్యంగా చూడాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం బలపడుతోంది.

ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్,

ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు. మధు

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 1
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్