ఆలయంలో అన్నదానానికి భారీ విరాళం
ఆలయంలో అన్నదానానికి భారీ విరాళం
జగ్గయ్యపేట, ఫిబ్రవరి 14, (వెలుగు నాడు ప్రతినిధి) : పావన కృష్ణా తీరంలో వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో నిత్యాన్నదానం జరుగుతుంది.ఈ అన్నదాన నిర్వహణకు ఎన్టీఆర్ జిల్లా,తిరువూరు మండలం, వావిలాల, రాజుగుడెం వాస్తవ్యులు కొమ్మినేని పుల్లారావు,కొమ్మినేని మౌనిష్ పేరు మీద 1,00,011 రూపాయలు విరాళముగా శనివారం సమర్పించారు.దాతకు శ్రీ స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదము అందజేసినట్లుగా ఆలయ కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్ బాబు తెలియజేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0