ఎంపీ కేశినేని శివనాథ్ ను కలిసిన ఎన్.ఎ.టి.ఎ. ప్రెసిడెంట్ కంచర్ల కిషోర్
నందిగామ జనవరి 13 (వెలుగు నాడు న్యూస్) : వీరులపాడు మండల కేంద్రం జుజ్జురూ గ్రామం లో నిన్న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వైస్సార్సీపీ నాయకులు ఫయాజ్ ఇంట్లో కి చొరబడి ఫయాజ్ ని మరియు వారి భార్య పిల్లల విచక్షణ
రహితంగా దాడి చేశారు.దాడిలో గాయపడి నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతూన్న వైస్సార్సీపీ నాయకులు మహమ్మద్ ఫయాజ్ మరియు కుటుంబ సభ్యులను మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పార్టీ నాయకుల తో కలసి వెళ్లి పరామర్శించి, దాడి వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఫయాజ్ వారి కుటుంబ సభ్యుల పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీస్ లను డిమాండ్ చేశారు.వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పై అధికార పార్టీ ప్రేరేపితంతోనే దాడులు చేస్తున్నారని వారికి రానున్న కాలం లో ప్రజలు తగిన బుద్ది చెబుతారని పేర్కొన్నారు.
అక్రమ కేసులకు భయపడటం లేదని దాడులకు ఉసిగొలపుతున్నారని వైస్సార్సీపీ కార్యకర్తల పై దాడులు చేసి మరల వారిపైనే అక్రమ కేసులుపెట్టి కుట్రలు చేస్తున్నారని అన్నారు. అధికారం ఉందనే అహంకారం తో ప్రశాంతం గా ఉండే గ్రామలలో గొడవలు, దౌర్జన్యాలతో కలిసిత వాతావరణం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో పలువురు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0